
శ్రీ గోదావరీ పుష్కర నిర్ణయము
గోదావరీ మహాత్మ్యము
శ్లో|| రేవాతీరే తపఃకుర్యాత్ మరణం జాహ్నవీతటే |
దానందద్యా త్కురుక్షేత్రే గౌతమీమ్యాంత్రితయంపరం ||
రేవానదీ తీరాన తపస్సు చేస్తే ముక్తి వస్తుంది. గంగాతీరాన తనువు చాలిస్తే ముక్తి వస్తుంది. కురుక్షేత్రంలో దానం చేస్తే మోక్షం కలుగుతుందని
అంటారు. గోదావరిలో స్నానం చేస్తే ఆ మూడు పుణ్యాల ఇట్టే లభ్యమవుతాయి.
శ్లో॥ పుష్కార్కే జన్మనక్షత్రే వ్యతీపాతే దినత్రయే ।
సకృ ద్దోదావరీస్నానం కులకోటిం సముద్ధరేత్ ॥
పుష్యమీ నక్షత్రం వున్న ఆదివారం నాడుగానీ, పుట్టినరోజు (జన్మతార వుండగా) నాడు గాని, వ్యతీపాతాలలోగాని, లేదా మామూలు
రోజులలో వరుసగా మూడు దినాలు (త్రిసంధ్యలా) గాని ఎవరైతే గోదావరీ నదిలో స్నానం చేస్తారో వారియొక్క కులంలోని కోటిమందికి
ఊర్ధ్వగతులు లభిస్తాయి.
శ్లో॥ యా గతి ర్ధర్మశీలానాం మునీనా మూర్ధ్వరేసాం |
సా గతి స్సర్వజంతూనాం గౌతమీతీరవాసినాం ॥
కొంచెము కూడా ధర్మం తప్పకుండా జీవించేవాళ్ళకూ, మునులకూ, యోగులకూ జీవితానంతరం యేయే ఉత్తమగతులైతే ప్రాప్తిస్తాయో
అటువంటి సద్గతులు - గోదావరి తీరంలో బ్రతికే సర్వప్రాణులకూ లభిస్తాయి.
శ్లో|| పంచానామపి భూతానాం అపాం శ్రేష్ఠత్వమాగతం
తస్మిన్ భాగీరధీ జ్యేష్ఠా తస్యా జ్యేష్ఠాతు గౌతమీ
ఆద్యాతు గౌతమీ గంగా పశ్చాత్ భాగీరధీసేవ్యా (స్మృతా)
తయో రేకతరా సేవ్యా గౌతమీ తత్రపావనీ ॥
భూమి, ఆకాశము, గాలి, నిప్పు, నీరు అను పంచభూతములలో నీరే శ్రేష్టమైనదిగా తెలుపబడుతోంది. ఆ నీళ్ళల్లో భగీరధునిచే
గొనిరాబడిన గంగాజలమే మొదటిది. అయినా కూడా, గౌతమునిచే గొనిరాబడిన గంగ (గోదావరి) యే అగ్రస్థానములో నున్నది. గోదావరిలో
స్నానం చేసిన తర్వాతనే గంగాస్నానం చేయాలని స్మృతులు చెబుతున్నాయి. గంగా, గోదావరులు రెండూ సామనంగా సేవించదగినవి
అయినప్పటికీ కూడా గోదావరియే అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతోంది. అనగా గంగాస్నానం చేసిన చేయకపోయినా, గోదావరిలో
స్నానం చేస్తే పుణ్యం కలిగి తీరుతుంది. కాని గోదావరిలో స్నానం చేయకపోతే గంగా స్నానం ఫలించదు.
శ్లో॥ యస్మిన్ దినే సురగురుః సింహస్థోపియుతో భవేత్ |
తస్మింస్తు గౌతమీస్నానం కోటి జన్మాఘ నాశనం ||
గురుడు (బృహస్పతి) సింహరాశి యందున్నప్పుడు స్వర్గమర్త్యపాతాళాది సమస్త లోకమందలి పుణ్యతీర్థములును గోదావరి యందే చేరి
యుండును. అనగా పుణ్యార్థులు ఆ సమయంలో గోదావరిలో స్నానం చేయాలి. ఇందువలన కోటి జన్మలలో చేసిన పాపం పోతుంది. ఇంక
యే నదిలో చేసినా ఆ పుణ్యం అందదు.
శ్లో॥ తుల్యాత్రేయీ భరద్వాజా గౌతమీ వృద్ధ గౌతమీ ।
కౌశికా చ వశిష్ఠాచ సర్పంతి సాగరంతథా || గోదావరి యేడు పాయలుగా చీలి సముద్రమున సంగమించుచున్నది. ఆ యేడు పాయలలో దేనియందు మునిగిననూ పుణ్యమే. అఖండ గౌతమిలో మునుగుట యింకనూ పుణ్యము గదా!
శ్లో|| అశ్వమేధ ఫలం చైవ లక్షగోదానజం ఫలం | ప్రాప్నోతిస్నానమాత్రేన (సప్తయంతిచ సాగరమ్)
పుష్కరాలప్పుడు గోదావరిలో స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసినంత ఫలం లభిస్తుంది. కావున, ఎల్లరూ యీ శుభవేళ గౌతమీ స్నానమాచరించి తరింతురు గాక.
గోదావరీ పుష్కర కథ
వివిధ పురాణకధాకధన శ్రీ మదనంతకోటి బ్రహ్మాండ నాయకుండగు భగవంతుని సృష్టి విశేషంబుల నెల్ల విశేషగుణాకరంబగు భరతఖండము నందలి నైమిశారణ్యము తపోవనంబుల కెల్ల తలమానికంబై అలరారుచుండెడిది. ఒకానొకప్పుడు విశిష్ట తపోవరిష్టులగు శౌనకాదిముని గరిష్ఠులెల్లవరునూ ఆ యరణ్యమున సమావిష్టులై సత్రమను యజ్ఞమును నిర్వహింపసాగినారు. అమ్మ హేష్ఠి దర్శనలాలసుడై సూతుడను ముని చతురతులనాఖని అచటికేతించినాడు. అంత, నా వనాంతర వాసులగు ఋషులెల్లరాయనకు సత్కరించి ఉచితాసనమున కూర్చుండచేసి, ఆయనను పరివేష్టించినవారైరి. ఆ మునుల కోరికపై సూతుడనేక పురాణములను వివరించు చుండగా, శ్రోతలగు ఋషులు "ఆర్యా! పాపపంకిలమందు కూరుకొనిపోవుచున్న మానవజాతికి సత్వర విముక్తి సంధిల్లు సూక్ష్మోపాయమును చెప్పవే” అని యర్థింపగా, అందులకా మహాజ్ఞాని మందహాసము చేయుచూ, “ఓ పుణ్యాత్ములారా! మేషాది ద్వాదశరాశుల యందునూ సర్వశుభగ్రహమగు గురుడు సంచరించు ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క నదికి పుష్కరకాలముగా నిర్ణయింపబడి యున్నది. ఈ పద్ధతి ప్రకారం బృహస్పతి మేషరాశియందు చరించు సంవత్సరము గంగానదికి, వృషభరాశిని గోచరించు వర్షమున నర్మదాకల్లోలినికి, మిధు నగతుడైనపుడు సరస్వతీఝురికి, కటకమందుండగా యమునాకూలంకషకు, సింహము నందున్నప్పుడు గోదావరీ నదీమతల్లికి, కన్య యందుండగా కృష్ణాస్రోతస్వినికి తులయందు కావేరీశైవలినికి, వృశ్చికమందు మసలునపుడు భీమా (తామ్రపర్ణీ) నదికి, ధనుశ్చారమున పుష్కరిణీ పులిందినికి, మకరమప్పుడు తుంగభద్రాసరిత్తునకు, మకరరాశి సంచారమున తుంగభద్రా తరంగిణికి, కుంభప్రవేశమున సింధుతటినికి, మీనప్రవేశమున ప్రాణహితాస్రవంతికి, ఈ విధముగా ఈ పన్నెండు నదులకును పన్నెండు సంవత్సరముల కొకసారి పుష్కరములేర్పడును. ఆయా పుష్కర సమయములందు ఆయా నదీస్నాన పూజాదాన ధర్మాదికముల ద్వారా మానవులు తక్షణ పాప విముక్తులగుటయే గాక, తర్పణాదికముల వలన తమ తమ పితృదేవతలకు సైతం ఊర్ద్వగతిని కల్పించిన వారగుచున్నారు” అని చెప్పినాడు. దానిపై ఋషులు “సర్వజ్ఞా! నీవు చెప్పిన పన్నెండు నదులలోనూ యే నదీ పుష్కరములు ఉత్కృష్టమైనవి?” అని అడుగగా “గోదా వరీ పుష్కరములే సర్వోత్కృష్టములైనవి. సమస్తనదీ పుష్కరములకన్ననూ గౌతమీ పుష్కరములే అమిత శక్తిమంతములు, అత్యంత మహాత్మ్యవంతములునూయై యొప్పుచున్నవి అనినాడు సూతుడు. అంతట, శ్రోతలగు ఋషులు “మహాభాగా! ఆ గోదావరీ కూలంక షాప్రాభవాదికములును, పుష్కర వైభవాదులును సవిస్తరముగా విశదీకరింప”మని కోరగా సూతమహర్షి యిట్లు వక్కాణింపదొడగెను. “పుణ్యశ్రవణ కుతూహలులారా! “గోదావరి గోదావరి గోదావరి'యని ముమ్మారు స్మరించినంతనే సర్వపాపముల నుండి విముక్త పరచు ఆ దివ్యాపగ చరిత్ర మెంత జెప్పిననూ తనివి తీరదు. అయిననూ నాయోపినయంత చెప్పెదనాలింపుడు. గంగయు గోదావరియు అభిన్నలు. ఈ రెండింటి పరీవాహ ప్రాంతములు వేరే గాని నిజమునకీ రెండును యొక్కటియే, ముందుగా గంగా విషయము తెల్పెదను వినుడు.”
గంగాజననము : పూర్వము దేవతలకు కంటకముగా పరిణమించిన ‘బలి' యనురాక్షరరాజు మదమణచుటకు శ్రీ మహావిష్ణువు వామనునిగా అవతరించినాడు. దానదీక్షాపరతంత్రుడైన బలివద్దకు పోయి తనకొక మూడడుగుల తావునిమ్మని కోరినాడు. బలి అంగీక రించి మూడడుగుల ఎడము గొనుమని ధారపోసినాడు. వెంటనే వామనుడు త్రివిక్రముడై ఒక అడుగుతో భూమినీ, వేరొక యడుగుతో ఆకాశమును ఆక్రమించి మూడవయడుగుగా బలిశిరమున పాదముంచి అతనిని పాతాళమునకు త్రొక్కినాడు. ఆ సందర్భమున ఊర్ద్వ లోకమందున్న బ్రహ్మ దిగువమండలములు కనరాక విష్ణుపాదముగా గుర్తించినాడు. ఎనలేని భక్తితాత్పర్యములు కలవాడై సర్వతీర్థ ములనూ తన కమండలువు లోనికి రప్పించి ఆ మహావారితో విష్ణు పాదమును ప్రక్షాళించినాడు. ఆ పాదోదకమును ఊర్ద్వవాసుల్లెరును శిరముల జల్లుకొన్నారు. ఓ పుణ్యాత్ములారా! పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు యొక్క పాదోదకమే మహాగంగ. ఆకాశమంతటి పాదమును కడుగుటయనిన అది యెంతనీరో ఆలోచింపుడు! ఆ మహాజలము నాలుగు దిక్కులుగా ప్రవహించినది. అందు తూర్పు దిశగా సాగినదానిని ముక్కోటి దేవతలునూ, గరుడ, గంధర్వ, కిన్నెర, యక్ష, విద్యాధరాది దేవయోనుల వారెల్లరునూ కలిసి దేవమును లతో సహా సేవించినారు. ఆ పాయయే మందాకిని'యను పేర దేవతా గంగగా పరిఢవిల్లుచున్నది. పశ్చిమ దిశగా ప్రాకిన ఆ దివ్యజలము వైకుంఠమున విరజానదియైనది. దక్షిణముగా సాగు గంగ దుర్వారము కాగా సాక్షాత్ ఈశ్వరుడే దానిని నిలువరించి తన శిరస్సున ధరించినాడు. శివ శిరస్థయైన ఈ సలిలమే అఖండ గంగగా పేరు పడినది. ఇది గంగా చరిత్రము. ఈ సందర్భమునందే భగీరథుని యత్నము, గంగ భూమికి వచ్చుట కూడా జరిగినవి. ఒక గోదావరీ నదీ ప్రాదుర్భావము గురించి తెలుసుకొందుము.
గోదావరి జననము : రసరాజ్ఞియైన గంగను వలిచి, శివుడామెను తలకెత్తుకొనినాడని తెలిసి శివానియైన గౌరి కోపించినది. ఎట్ల యిననూ గంగను తన భర్తనుండి యెడము చేయవలెనని తలచి, ఆ పనికై ఆమె వినాయకుని నియోగించినది. విఘ్నేశ్వరుడు తగిన అదునుకొరకై ఎదురు చూడసాగినాడు.
బ్రహ్మగిరిపై గౌతముడను ఋషి కలడు. అతడు మహాతపస్వి. శివునకు అత్యంత ప్రియమైన భక్తుడు. అతని ఆశ్రమ ప్రాంతములో కరువు
కాటకములు రాగా, కంఠేకాలుడు గౌతమునకు ఒక వరమునిచ్చినాడు. ఆ ప్రకారమా ఋషి అతని చేతిలో కాసిని విత్తనములు చల్లినచో ఎట్టి
బంజరు నేలయందైనా సరే, కొన్ని నిమిషములలో ధాన్యము పండిపోవును. ఆ వరప్రభావముచే ఆ గౌతముడు ఎట్టి కరువు కాటకములలో
సైతం నిత్యము సద్యోజాత ధాన్యసంపత్తుతో ఆశ్రితులకు, ఆగంతకులకూ అన్న సమారాధన మాచరించుచుండె డివాడు. ఇది కనిపెట్టిన
వినాయకుడు అక్కడకు చేరినాడు. ఒకనాడు గౌతముడు ఒక క్షేత్రములో విత్తనములు చల్లి, జపము చేసికొను టకై వెళ్ళినాడు. అలవాటు
ప్రకారం విత్తనములు వెనువెంటనే పెరిగినవి. అది గమనించిన వినాయకుడు ఒక మాయాగోవును సృష్టించి ఆ పైరు నడుమ వదిలెను. గోవు
పైరును మేయసాగెను. జపము ముగించుకొని చేనువద్దకు వచ్చుచున్న గౌతముడు చూసి, ఎన్నడూ లేని ఆ యాటంకమునకు ఆశ్చర్యపోయెనె.
పైరును గోవు మేసినచో అన్నసమారాధమునకు విఘ్నము కలుగునని భావించి అచ్చట పడియున్న ఒక జీర్ణతృణమును తీసి “హరి-హరి” అని
అదలించుచూ ఆ గోవుపైకి విసిరినాడు. అంత శ్రీ విఘ్నేశ్వరుని మాయవలన గౌతముడు ‘హరీ’ అనినదే తడవుగా, ఆ మాయా గోవు ‘హరీ
అనినంతపని అయినది. మహాతపస్వియైన గౌతముని ముఖత: వెలువడిన ‘హరి’నామముచే అభిమంత్రితమైన గడ్డిపరక ఆగ్నేయాస్త్రము వలె
పనిచేయగా, అంతర్దహనోద్వేగితయై ఆ యావు అనూహ్యమైన వేదన పడుచూ, అరచుచూ, ఆ ప్రాంతమంతయూ, కలగాపులగముగా తిరిగి
అటునుండి తూర్పునకు సాగిపోయినది. ఆ విధముగా పశువు వేదనతో పొర్లాటపడిన స్థలమే కాలక్రమమున “పశువేద” అను గ్రామముగా
పరిణమించినదని చెప్పబడుచున్నది.
ఆవు చేసిన ఆర్తనాదములకు, పరిసరముల మునిగణములన్నియూ బైటకు వచ్చినవి. ఆవు వెంట పడినవి. కొంతదూరమేగి, నేలన పడి ఆ
ఆవు కాళ్ళు చాపివైచినది. కండ్లు తేలవేసినది. ఇంకేమున్నది? ఆచారపరులకు ఆవు చావు అఘాయిత్యమే కదా? అందునా అది మహాముని
విసిరిన గడ్డిపరక దెబ్బకు మరణించినదాయె! అందువల్ల ఆ పరిసర బ్రాహ్మణులెల్లరును చేరి, గోహత్య చేసిన వానితో తాము కూడియుండమనినారు.
గౌతముని తమనుండి వెలివేసినారు. అంత గౌతముడు తగిన ప్రాయశ్చిత్తమును తెలిపినచో చేసి కొందునని ప్రార్థించగా, సాటివిప్రులు
దయతలచి, “గౌతమా! నీచే కొట్టబడి మరణించిన యీ గో కళేబరముమీదుగా శివ శిరస్థమైన గంగను ప్రవహింపచేసినచో నీ గోహత్యాపాతకము
తొలగిపోవు”ననిరి.
గౌతముడు శివునికై తీవ్రముగా తపించినాడు, తరలివచ్చినాడు. తరేణేందు శేఖరుడు. గంగ నిమ్మనినాడు గౌతముడు. భగవంతు నకు
భక్తులకంటెను ప్రియులెవరును యుండరుగదా! అందుచే శివుడాతని కోర్కెను అంగీకరించినాడు. నిత్యగాంగాంభః స్నాతార్ద్రములైన తన
సటలలో నుండి యొకటి పెరకి పిండినాడు. అంతట గంగకు ధరాపాతమైనది. భగీరథుని వెంట నంటిన గంగ భాగీరధియైనట్లుగా, గౌతమునికై
వెలువరించబడిన గంగ ‘గౌతమి’యను పేర నదియైనది. ఆ నదీమ తల్లియొక్క కోరికననుసరించి ఆమె ఆమె గోముఖాకృతి నుండి బాహ్యమునకు
ప్రకటింపబడునట్లుగా వరమిచ్చినాడు హరుడు. తన వలపుల రాణి యగు ఆమె వాంఛమేరకు గౌతమీ జన్మస్థాన మగు ‘నాసిక్’ ప్రాంతమున
అతిలోక సుందరుడైన త్య్రంబకేశ్వరునిగా అవతరించినాడు.
ఓ పుణ్యాత్ములారా! ఈ విధంబుగా శివదత్త
పావనోదారవాః పూర్వము తనను వెన్నంటిరాగా గౌతముడు గంగాతోయములను గోవుయొక్క
మృతకళేబరము మీదుగా ప్రవహింపచేసినాడు. గోవునకు సద్గతి కలిగినది. బ్రాహ్మణులు గౌతముని మెచ్చుకుని, తిరిగి కులమున చేర్చుకొనినారు.
గోకళేబరము నావరించి ప్రవహించుటచే గౌతమీనదిగి ‘గోదావరి యను వ్యవహారనామ మేర్పడినది. జన్మ స్థలమగు ‘నాసిక్’ మొదలు సముద్ర
సంగమమువరకు దాదాపు వేయిమైళ్ళు పొడవునా ప్రవహించు యీ నదీమతల్లి యొక్క యే ప్రాంత మునందు మును కలిడిననూ పుణ్యమే
యగునని శివవరము. మరియు ఎవరైనను గోదావరీ స్నాన సంకల్పమాత్రులైవెడలుచూ, మార్గ మధ్యమును మృతులైననూ ఊడా, గౌతమీ
స్నాన సంకల్ప పుణ్యబలముచే వారు మోక్షార్హులే యగుదురని పెద్దలునొక్కి వక్కాణించు చున్నారు. ఇది గోదావరీ ప్రభావము.
పుష్కరోత్పత్తి: “హే మహామునీ! గోదావరియొక్క అద్భుత చరిత్రను వినిపించి మమ్ములను ఆనందపరశులను చేసినావు. అదే విధముగా
పుష్కరమనగా యేమిటో ఇది పండ్రెండ్లకు ఒక్కసారే వచ్చుటలోని అంతరార్థమేమిటో ఆ వివరములు కూడా వినిపింపవే!” అని ఋషులు
కోరగా సూతుడిట్లు తెలియజేయసాగినాడు.
సాధారణ కశ్మలజలాలను ఇండుపగింజ యెలా శుద్ధి చేస్తుందో అదే విధంగా అనేకానేక జీవుల పాపపంకిలాన్ని తయందిముడ్చు కొనే
మహానదులు పునఃచైతన్యముత్తేజితాలు కావడమే పుష్కరం అనిపించుకొంటూవున్నది.
జీవులందరూ తమ పాపాలను నదులలో వదిలినట్లయితే అట్టి పాపములతో నిండిన ఈ నదులెట్లు పునీతములగును? అని సంది
గ్ధతర్కమానసుడైన పుష్కరుడనే బ్రాహ్మణుడు, శివునిపై తపించి ఈశ్వరుని అష్టమూర్తులలో ఒకటైన జలత్వసిద్ధికై ప్రాధేయపడినాడు. భక్తుని
ముగ్ధావేదనను అర్థము చేసుకొనిన పశుపతి అతని కభయమిచ్చి భక్తునకు పుష్కర స్ఫూర్తిగా పరిణమించినాడు. అది తెలిసిన బ్రహ్మశివుని
ప్రార్థించి, పుష్కరతత్వాన్ని తన కమండలుజలంలో భద్రపరచుకోగలిగాడు.
యింతటి తప్పు చేయుటకు తలపడితివో అట్టి నీనిలువెల్లనూ ఆ యోనులమయమైపోవును గాక” అని ఇంద్రునీ శపించినాడు. అహల్య
రాయియైపోయినది. ఇంద్రుని ఒడలెల్ల యోఎని సంజ్ఞలైనవి. ముల్లోకముల నేలు మోనగాడా భీషణ శాపఫలము భరించలేక గురువగు
బృహస్పతి నాశ్రయించినాడు. దేవగురువా విరూపియగు మఘవుని వెంటనిడుకొని, బ్రహ్మకడకేగి ప్రార్థించినాడు. అయిననూ అతని విరూపకత
నశించలేదు. అంత బ్రహ్మ మందాకిని వద్ద నొక్క సరసు నిర్మింపచేసి అందులో తన కమండలము నందలి పుష్కర జలమును కొంత
ప్రోక్షించినాడు. మహేంద్రుడందు స్నానము చేయగా అమిత వికృతమగు రూపము పోయి యధాపూర్వ సుందరుడైనాడు. ఆకాశగంగ కన్ననూ
అత్యంత ప్రభావ సమన్వితమైన పుష్కర మహాత్మ్యమునకు దేవేంద్రుడునూ బృహస్పతియూ కూడా అబ్బురపడినారు.
నదులకు పుష్కరము లేర్పడుట : అతిలోక విస్మయకరమైన పుష్కర మహాత్మ్యమానోట ఆ నోట జగమంతా ప్రాకసాగినది. ఆకాశగంగ
కన్ననూ అమలమైన ఆ పుష్కర సమ్మేళమునకై నదులన్నియు ఉవ్విళ్లూర సాగినవి. గంగా గౌతమీనదులకు ముందిడుకొని సర్వమహోప నదులు
స్రష్టమ ప్రార్థించినవి. అదేవేళ పుష్కర మహిమను కనులారా తిలకించి యున్న శుభగ్రహగు గురుడు తనకును పుష్కరత్వమా పాదింపుమని
ప్రార్థించినాడు. కాని పుష్కరుడందులకు అంగీకరించలేదు. అయిననూ, నదులయొక్కయు, గురుని యొక్కయు, ప్రార్థనపై బ్రహ్మ పలురీతుల
పుష్కరుని సంతుష్టునొనరించి ఎట్టకేలకు జీవ, జీవమనముల వాంఛను తీర్చినాడు. ఆ మేరకు గురుపుష్టికై ఆయా రాశులలో చేరిన తొలి
పండ్రెండు దినములునూ, రాశినివిడచు తుది పండ్రెండు దినములును బ్రహ్మచే నిర్ణయింపబడిన నదుల యందు తానుండుటకు అంగీకరించినాడు.
రాశికొక సంవత్సరము చొప్పున గురుడు పన్నెండు రాశులలోనూ సంచరించుటకు పన్నెండు సంవత్సరములగును. కావున ఒక్కొక్క నదికీ
పన్నెండు సంవత్సరములకు ఒక్కమారే పుష్కర పుణ్యకాలము సంక్రమించుచున్నది. గోదావరీ నదికి పుష్కరోత్సవము.
అట్లు గురుడు సింహరాశిని ప్రవేశించగనే, మూడే కోట్లయేబడి లక్షల తీర్థములతో సమేతుడై పుష్కరుడు గోదావరి నాశ్రయించును. అది
మొదలు సంవత్సరాంతము వరకు తీర్థములన్నియూ, గోదావరి యందే యుండును. పుష్కరుడు, తొలి పండ్రెండు దినములును, సంవత్సరము
చివరనొక పండ్రెండు దినములును గోదావరి యందుండును. కావున మొదటి పండ్రెండు దినములను ఆది పుష్కరము లనియు, చివరి
పండ్రెండు రోజులను అంత్య పుష్కరములననియు పిలిచెదరు. ఈ అంత్య పుష్కరోత్సవము అన్ని నదులకూ జరగదు. ఒక్క గోదావరికి మాత్రమే
సంభవించుట యీ నది ప్రత్యేకత. కావున, సాధారణకాల గౌతమీస్నానమే సర్వార్ధసిద్ధికరము కాగా, యీ పుష్కర పుణ్య కాలములో గౌతమీ
స్నానమూ, ఆ తీరమున సాగించు జపహోమదానధర్మ తర్పణాదిక కర్మతంత్రములన్నియు సహస్రాధిక ఫలము ననుగ్రహించును. అందుచేతనే
మహామహులగు ఋషులనేకులు గోదావరి గురించి
“పంచానామపి భూతానాం | ఆపః శ్రేష్ఠత్వమాగతాః
తస్మిన్భాగీరథీ జ్యేష్ఠా | తస్యా జ్యేష్ఠా తు గౌతమీ |
ఆద్యాతు గౌతమీ గంగా | పశ్యాద్భాగీరథీస్మృతా
తయోరేకతరాసేవ్యా । గౌతమీ తత్ర పావనీ | అని ఉటంకించారు.
మహామనస్వులారా! ఇంకొక్క విషయము సోదాహరణముగా వివరించెదను. ఈ గోదావరి గంగాదనిని సైతము పవిత్ర వంతము చేయగల
దివ్యజలమని మరచిపోరాదు. అందువలననే కాశీకిపోయినవారు గంగోదకమును తెచ్చి గోదావరిలో కలుపుటయను ఆచారము కలదు. అట్లు
కలుపుటచే గంగ పాపవిముక్త యగునని దైవజ్ఞ నిర్ణయము. అందువలన, గంగనే పావనము చేయగల శక్తి గోదావరికి యున్నదని తెలిసికొనివలెను.
ఒక్క ముక్కలో చెప్పవలెనన్నచో గోదావరికన్న గొప్పనదియూ, గోదావరీ పుష్కరముల కన్న పుణ్యకాలమును సృష్టిలోనే లేవు అని సూతుడు
చెప్పగా విని ఋషులు ఆనందించిరి.
అఖండ గౌతమి
మహారాష్ట్రలో ఆవిర్భవించిన గోదావరీ నది నిజామాబాద్ జిల్లా గుండా ఆంధ్ర దేశమున తన తొలికెరటపు టడుగునుంచినది. బాసర
మహా క్షేత్రంలో సరస్వతీదేవి చల్లని చూపులను పొదువుకొని, వేములవాడ కాళేశ్వరములలో తన సోయగాలకై శివుడు చేసే చిలిపి సైగలకు
సిగ్గుపడిపోతూ భావుకతలను రంగరించుకొని, అగ్ని మండలమైన భద్రాచలాన్ని ఆర్ద్రతా భరితంచేసి, తెలుగింటి ఇలవేలుపులైన సీతారాముల
పవిత్రానురాగాలను పుణికిపుచ్చుకుని తూర్పు కనుమల ద్వారా పాపికొండలను తరించి మైదాన ప్రాంతానికి వచ్చి రాజమహేంద్రవరము
మీదుగా బంగాళాఖాతంవైపు సాగింది. అత్యంత విశాలమై ప్రవహించే గోదావరి ఈ ప్రాంతంలోనే అఖండ గౌతమిగా ఆరాధింపబడుతోంది.
సరస్వతి చల్లని చూపులనూ, భావుకతలనూ, పవిత్రానురాగబంధాలనూ, రాజమండ్రిలోనే భద్రపరచి, ధవళేశ్వరం వైపు కదలి ఆ పై నుండి
అఖండ గౌతమి సప్త గోదావరిగా యేడుపాయలుగా చీలిపోయినది.
సప్త గోదావరులు
1. తుల్య, 2. ఆత్రేయ, 3. భరద్వాజ, 4. గౌతమి, 5. వృద్ధ గౌతమి, 6. కౌశిక, 7. వశిష్ఠ అను యేడు గోదావరి పాయలనూ సప్త
గోదావరులందరు. ఈ సప్త గోదావరులనూ వివిధ దివ్యక్షేత్రములను, పునీత మొనరించుచు సాగి తూర్పు సముద్రమున కలియుచున్నవి.
నాసిక్లో జన్మించి అంతర్వాహినిగా సాగి త్ర్యంబకమందలి గోముఖము ద్వారా పునరావిర్భూతయై సముద్ర సంగమము వరకు దాదాపు వెయ్యి
మైళ్ళ నిడివిని ప్రవహించు గోదావరి అడుగడుగునా పవిత్రమైనదే. కణకణమునా సోయగమున్నదే. ముఖ్యముగా పాపికొండల నడుమ ఆ
పడవ ప్రయాణము చేసియే తీరవలెను. ఇంతయేల? పుష్కరవేళ గౌతమీ నదిలో ఒక్కరోజు స్నానమాడినచో అరువదివేల సంవత్సరములు
గంగాస్నానమాడిన ఫలితమని పెద్దలు చెప్పుచున్నారు.